ప్రజా నాయకుడు ఉజ్వలుడు….!
◆ : వృత్తి రీత్యా వైద్యుడైన పేదల పెన్నిధి
◆ : ఇటీవలే కోట్లు ఖర్చు చేస్తూ చిరాగ్ పల్లిలో పాఠశాల నిర్మాణం
◆ : ప్రజల్లోనే నిరంతరం ఉండే నాయకుడు
” ప్రజలకు నేనున్నాని భరోసా కలిపించే నాయకుడు
జహీరాబాద్. నేటి ధాత్రి:
ప్రజల సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలకు భరోసా కలిపించే వాడే నాయకుడు, తండ్రి బాటలో నడుస్తూ వృత్తి రీత్యా వైద్యుడు ఆయన వైద్యునిగా కొనసాగుతూనే జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలకు నేనున్నాని భరోసా కలిపిస్తూ నిరంతరం ప్రజల్లో ఉంటు పేద ప్రజల సమస్య తీరుస్తున్న నాయకుడు ఆయన, అతని ఎవరో కాదు చిరాగ్ పల్లి గ్రామానికి చెందిన జహీరాబాద్ మండలం మాజీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిరాగ్ పల్లి నారాయణరెడ్డి కుమారుడు డాక్టర్, ఉజ్వల్ రెడ్డి గత కొంతకాలం నుండి అమెరికాలో వైద్య సేవలు చేస్తూ తాను జన్మించిన గడ్డపైన పేదలకు ఎదో మంచి చేయాలనుకుని రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లోకాంగ్రెస్ పార్టీ నుండి జహీరాబాద్ పార్లమెంట్ టికెట్ ఆశించారు కాని ఎంపీగా టికెట్ రాకపోయిన కాంగ్రెస్ అధిష్టానం మాటకు కట్టుబడి ఉండి క్రమశిక్షణ కలిగి, నేటి జహీరాబాద్ ఎంపీ సురేష్ కెట్కర్ కు మద్దతుగా ఆయన విజయానికి కృషి చేశారు. కాని ఎంపీ టికెట్ రాలేదని ఎక్కడ నిరాశచందకుండా పేద ప్రజలకు అండదండగ ఉంటున్నారు. జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఏకైక నాయకుడు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి, పేద ప్రజల సమస్యలను ఓపిగగా వింటు తన సొంత సమస్యగా పరిగనించి పరిష్కరిస్తున్న నాయకుడు. ఇటీవలే జహీరాబాద్ మండలం తన స్వగ్రామం అయిన చిరాగ్ పల్లిలో పేద విద్యార్థుల గురించి సొంత నిధులు ఖర్చు చేసి దాదాపు 6కోట్ల వ్యయంతో పాఠశాల నిర్మిస్తున్నారు. రాబోయే రోజుల్లో పేద విద్యార్థులు ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని సంకల్పించి సేవ కార్యక్రమాలు చేస్తున్న ఏకైక నాయకుడు ఉజ్వల్ రెడ్డి, ఎటువంటి వారు సహాయం కోరిన చిరునవ్వుతో వారిని పలకరించి సమస్య తీరుస్తున్న నాయకుడు సౌమ్యుడు ప్రజల మేలు కోరే నిజాయితీ కలిగిన వ్యక్తి, రాజకీయాలు వేరు ప్రజా సమస్యలు వేరుగా చూసి రాజకీయాలకు అతీతంగా సేవచేస్తున్న గొప్ప వ్యక్తిత్వం కలిగిన నాయకుడు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి. ప్రజా సేవకుడు ప్రజలను సేవలందిస్తున్న మహా నాయకుడు ప్రజల ఆపదనులను ఆదుకుంటున్న ప్రజా నాయకులు ప్రజల్లోనే నిరంతరం ఉండే నాయకుడు
డాక్టర్ ఉజ్వల రెడ్డి.