రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ.
పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి
కాశిబుగ్గ నేటిధాత్రి.
ఆదివారం గ్రేటర్ వరంగల్ 16 వ డివిజన్ పరిధిలోని గరీబ్ నగర్ నుండి కీర్తి నగర్ వరకు డివిజన్ అధ్యక్షులు దుపాకి సంతోష్ ఆధ్వర్యంలో పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో ముఖ్య అతిథిగా పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.అనంతరం పరిరక్షణ పాదయాత్రను ఉద్దేశించి రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగాన్ని బిజెపి ప్రభుత్వం అవమానించిందని, రాజ్యాంగ పరిరక్షనే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు.మన రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవటానికి పోరాటం చేయాల్సిన పరిస్థితి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొని వచ్చిందని అన్నారు.ప్రతి గ్రామానికి,ప్రతి వీధికి, ప్రతి ఇంటికి వెళ్లి రాజ్యాంగానికి జరుగుతున్న ప్రమాదాన్ని వివరించాలన్నారు. పేద, బడుగు,బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరడం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు.కుల మతాలను రెచ్చగొడుతూ బిజెపి ప్రభుత్వం పబ్బం గడుపుతుందని అన్నారు.దేశంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మరియు భారత రాజ్యాంగం పై బిజెపి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, డివిజన అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.