గర్భిణీలు,బాలింతలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి

గర్భిణీలు,బాలింతలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి

తొర్రూరు(డివిజన్) నేటి ధాత్రి

 

Pregnant women

Pregnant women

గర్భిణీలు బాలింతలు పిల్లలు అంగన్వాడి కేంద్రాలలో ప్రభుత్వం పంపిణీ చేసే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా మండలంలోని అమర్ సింగ్ తండా, కర్రె బిక్యా తండా, చౌల తండా అంగన్వాడి సెంటర్లలో చిరుధాన్యాలపై అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పోషకాహారం తీసుకోవడం వల్లే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని, తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు ఉన్న రాగి జావా, పల్లి పట్టి, నువ్వుల లడ్డు, జొన్న లడ్డు, చిరుధాన్యాలతో లడ్డు, బెల్లంతో తయారు చేసిన పరమాన్నం, పుట్నాలు, వేరుశనగ పల్లీల పొడి, మునగాకు కారం పొడి మొదలగు పదార్థాలు,పోషక విలువలు గల ఆహార పదార్థాలు ఆకుకూరలు, పండ్లు, చిరుధాన్యాలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మడిపల్లి హెల్త్ సూపర్వైజర్ జిఎల్. మేరీ, అంగన్వాడి టీచర్లు జె కమలాదేవి, వి.భారతి, చంద్రకళ, సీత, ఏఎన్ఎం ఉమా,శారద, ఆశా కార్యకర్తలు స్వరూప,కరుణ, ఆయా శారద, స్థానికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!