తెలుగు విభాగంలో కుమ్మరి ఓదేలుకు డాక్టరేట్.

Osmanya university Osmanya university

తెలుగు విభాగంలో
కుమ్మరి ఓదేలుకు డాక్టరేట్
హైదరాబాద్ నేటిధాత్రి:

 

ఉస్మానియా విశ్వ విద్యాలయం, హైదరాబాద్ తెలుగు విభాగంలో వరంగల్ జిల్లా కథా సాహిత్యం పరిశీలన అనే అంశం పైన డాక్టర్ పూర్ణ ప్రజ్ఞ చంద్రశేఖర రావు పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేసినందున పీహెచ్డీ పట్టాను ఉస్మానియా విశ్వవిద్యాలయం అందజేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా మొగుళ్ళపల్లి మండలం గుడిపహాడ్ అనే గ్రామానికి చెందిన కుమ్మరి చిన్న సమ్మయ్య సారమ్మ అనే దంపతులకు జన్మించిన చివరి సంతానం ఓదేలు శారీర వైకల్యం కలిగిన ఓదేలు తన కుటుంబ సభ్యుల సహాయ సహకారంతో అన్నత విద్యనభ్యసించి డాక్టర్ పట్టాను పొందారు.ప్రాథమిక విద్యను స్వగ్రామంలో పూర్తిచేసి, హై స్కూల్ విద్యను మొగుళ్లపల్లి మండలం లో ఉన్న జెడ్ పి పి ఎస్ ఎస్ మొగుల్లపల్లి హైస్కూల్లో చదివి, ఇంటర్ ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాల స్టేషను ఘన్ పూర్ లో, కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బిఎ స్పెషల్ తెలుగు చదివి ఉన్నత విద్యను ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని ఎం. ఎ తెలుగులో, ఎం.ఎ అర్థశాస్త్రంలో పూర్తిచేసి, టీచర్ ట్రైనింగ్ చేసి పీహెచ్డీ లో ప్రవేశం పొంది వరంగల్ జిల్లా కథా -సాహిత్యం పరిశీలన అంపశయ్య నవీన్ రామచంద్రమౌళి గారి కథల పైన పరిశోధన చేసి పీహెచ్డీ పట్టానుపొందారు. పీహెచ్డీ పట్టాను పొందిన ఓదేలును మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల సంస్థాన్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు ,వ్యాఖ్యాత, డా బి. వెంకట్ కవి, కుటుంబసభ్యులు, గురుకుల అధ్యాపకులు, మిత్రులు, కవులు, కళాకారులు, తదితరులు, అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!