వంతెన నిర్మాణంలో జాప్యం ఎందుకు.
శంకుస్థాపన చేశారు.. పనులు వదిలేశారు.?
ఇబ్బందుల్లో ప్రయాణికులు,ప్రజలు.
ప్రాణాలు పోతున్న పట్టించుకోని అధికారులు.
జహీరాబాద్. నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ప్యాలవరం సమీ పంలో వంతెన నిర్మాణంలో జాప్యం నెలకొంది.ప్రతిఏటా వర్షాకాలంలో వరద ఉద్ధృతి పెరిగినప్పుడు గ్రామానికి వెళ్లలేని పరిస్థితి. వంతెన నిర్మించి ఇక్కట్లు తీర్చాలని గ్రామస్థులు పార్టీలకు అతీతంగా అధికా రులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరిగి నిధులు మంజూరు సాధించు కున్నా… నేటికీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఎంపీ సురేష్ షె ట్కార్, ఎమ్మెల్యే మాణిక్ రావు
నాలుగు నెలల కిందట పనులకు శంకుస్థాపన చేశారు. వంతెన నిర్మా ణానికి పీఆర్ఆర్ శాఖ నుంచి రూ.3 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటి కైనా త్వరితగతిన వంతెన పనులు ప్రారంభించి వర్షాకాలం నాటికల్లా పూర్తిచేస్తే ప్యాలవరం, దేవరంపల్లి, ఈదులపల్లి, దిగ్వాల్ గ్రామాల ప్రజలు ఇబ్బందులు తొలగిపోతాయి.