హరిత సేన నియోజకవర్గం, మండల కమిటీల నియామకం
గంగాధర నేటిధాత్రి:
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నెపథ్యంలో, చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో హరిత సేన రాష్ట్ర కోఆర్డినేటర్ గర్రెపల్లి సతీష్, నియోజకవర్గ, మండల స్థాయి కమిటీ సభ్యులను మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్వగృహంలో సోమవారం ప్రకటించారు.
మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జిగా మామిడిపెల్లి అఖిల్, గంగాధర మండల అధ్యక్షుడిగా జెలెందర్ రెడ్డి, రామడుగు మండల అధ్యక్షుడిగా బైండ్ల మధు, బోయినిపల్లి మండల అధ్యక్షుడిగా కన్నం సాగర్, మల్యాల మండల అధ్యక్షుడిగా అరుణ్, కొడిమ్యాల్ మండల అధ్యక్షుడిగా ఇంతియాజ్, చొప్పదండి మండల అధ్యక్షుడిగా భక్తు విజయ్ కుమార్ ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా ఇనుగుర్తి శ్రీనివాస్, గర్రెపల్లి సతీష్, నూతికడి బోజనరాయణ, కమల్ గౌడ్ తదితరులు నూతన కమిటీకి దిశానిర్దేశం చేశారు. సుంకె రవిశంకర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా భావించాలి అని, మొక్కలు నాటడం ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి ప్రపంచాన్ని అందించవచ్చని తెలియజేశారు. ఆఖరులో కమిటీ సభ్యులు మొక్కలు నాటడమ ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. హరితసేన సభ్యులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.