మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలి.

BJP BJP

మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలి
బీజేపీ మత చాందసవాద రాజకీయాలను మానుకోవాలి…ఏఏం సి చైర్మన్‌ నరుకుడు వెంకటయ్య
`మతం అంటే నమ్మకం విశ్వాసం… మతం అంటే రాజకీయం కాదు బీజేపీ నాయకులు గుర్తేరుగాలి
`బతుకమ్మ పట్టుకున్నాడు బోనాల పండుగలలో బోనమెత్తిన నాయకుడు మా ఎమ్మెల్యే కె.ఆర్‌.నాగరాజు
`అన్ని మతాచారాలను, మత విశ్వాసాలు గౌరవించే నాయకుడు ఎమ్మెల్యే కె.ఆర్‌. నాగరాజు
`మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెడుతూ మత విద్వేషాలను రెచ్చగొట్టే కుటిల బుద్ది బీజేపీ నాయకులు మానుకోవాలి
`జై బాపు, జై భీమ్‌, జై సంవిధాన్‌ అనేది కాంగ్రెస్‌ పార్టీ నిధానం
`లౌకిక వాదం, బావసారుప్యత కాంగ్రెస్‌ పార్టీ విధానం : కాంగ్రెస్‌ నాయకులు

వర్ధన్నపేట,నేటిధాత్రి:

నియోజక వర్గ కేంద్రములో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఏద్దు సత్యం,వర్ధన్నపేట ,వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నరుకుడు వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీ , కోతపెల్లి గ్రామ మాజీ సర్పంచ్‌ కమ్మాగొని ప్రభాకర్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకులు పోషాల వెంకన్న గౌడ్‌ లు విలేఖర్లతో మాట్లాడుతూ.గతములో వర్ధన్నపేట శాసన సభ్యులు కేఆర్‌ నాగరాజు గుళ్ళు కడితే బిచ్చా గాల్లు అవుతారు, బడులు కడితే విద్యావంతులు అవుతారని మాట్లాడిన మాటలను బీజేపీ నాయకులు వక్రీకరించి రాజకీయ రంగును పులుముతున్నారు మన శాసన సభ్యులు కేఆర్‌ నాగరాజు డా: బీ అర్‌ అంబేద్కర్‌ ఆశయాలను కొనసాగించే విధంగా అంబేద్కర్‌ హైడాలోజిలో మాట్లాడడం జరగింది.కేఆర్‌ నాగరాజు మాట్లాడిన మాటలు డా: అంబేద్కర్‌ చెప్పినవే . ఓ. ఏస్‌.నేడు ఈ దేశములో ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీలు స్వేచ్చా గా జీవిస్తూ ఐఏఎస్‌,ఐపీఎస్‌,డాక్టర్లు,లాయర్లు,ఇంజనీర్లు, పొలిటీషియన్లు అయ్యారు అవుతున్నారాంటె, డా:బీ.అర్‌ అంబేద్కర్‌ చలవే. మి లాగా నిత్యం మతం ,బజనలు చేసుకుంటూ పోతే మా వర్గాలు ఈ దేశములో జీవించే స్థానమే లేదు.
ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్‌ ని జవహర్‌ లాల్‌ నెహ్రూ క్యాబినెట్లో న్యాయ శాఖ మంత్రి నీ చేసి గౌర వించింది . మి లాగా (బీజేపీ) గుళ్ళు, గోపురాలు, బజనలు,కీర్తనలు నమ్ముకుంటు,చేసుకుంటూ పోతే ఎస్సీ, ఎస్టీ లు వంద సంవత్సరాల క్రితం ఎలా ఉన్నా మో,నేటి వరకు అలానే ఉండే వాళ్ళము. నేడు ఈ దేశములో బీజేపీ పార్టీ మతం పేరుతో రాజకీయం చేయకుండా ,లౌకిక ప్రజాస్వామ్య లోకి రాండి.135 సంవత్సరాల నుండి మొదులుకొని నేటి వరకు ఈ దేశంలోని ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ,నిమ్న ,అణగారిన వర్గాల ప్రజల సంక్షేమం కోసమే కాంగ్రెస్‌ పార్టీ పని చేస్తూ వస్తుంది.నేడు కూడా కాంగ్రెస్‌ పార్టీ జై బాపు,జై బిమ్‌,జై సంవిధాన్‌ నినాదంతో బ్రహ్మ నడంగ ముందుకు వెళుతున్నా ము.భవిష్యత్‌ ఎన్నికలలో ప్రజలు ఎవరిని ఆదరిస్తారో తెలుస్తోంది. గురువింద గింజ లాగా మాటలు మాట్లాడి మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ నుండి డిమాండ్‌ చేస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!