సిసి రోడ్ల ప్రారంభం
నిజాంపేట , నేటి ధాత్రి
మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చౌకత్ పల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులను తాజా మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రావిపల్లి అమర సేనా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సహకారంతో 500 మీటర్ల మేర 20 లక్షల నిధులతో సిసి రోడ్ ను ప్రారంభించామన్నారు . అలాగే వారికి కృతజ్ఞతలు తెలిపారు ఎల్లవేళలా రోహిత్ కు రుణపడి ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లాల్య నాయక్, రాములు, సూర్య నాయక్, రాజు నాయక్, మంజుల, బోయిని నాగరాజ్ ,బాలయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు