పోగొట్టుకున్న డబ్బును తిరిగి బాధితురాలుకు అందజేసిన ఎస్సై రాజేందర్
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేటిధాత్రి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కుర్నవల్లి గ్రామానికి చెందిన ఆవుల జుగునమ్మ ఆమె అకౌంట్లో ఉన్న 28 వేల రూపాయలను వేరే అకౌంట్ లో పడి చాలా రోజులు నుండి బ్యాంకుల చుట్టూ తిరుగుతూ నాన్న ఇబ్బందులు పడి రెండు రోజుల క్రితం కరకగూడెం పోలీస్ స్టేషన్కు వచ్చి తన సమస్యను ఎస్సై రాజేందర్ సార్ తో చెప్పుకోగా వెంటనే స్పందించి ఆమె అకౌంట్లో ఉన్న డబ్బులు ఎవరి అకౌంట్లో పడినాయి అని సంబంధిత బ్యాంక్ అధికారులతో మాట్లాడి ఈరోజు జుగుణమ్మ పిలిపించి డబ్బులు ఇప్పించడం జరిగింది. ఈ విషయంపై జుగుణమ్మ ఎస్సై రాజేందర్, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.