రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు అవగాహన..

farmers farmers

రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు అవగాహన..

రామాయంపేట మార్చి 18 నేటి ధాత్రి (మెదక్)

 

 

Farmers
Farmers

ఈరోజు అనగా మంగళవారం రైతు వేదిక రామాయంపేట నందు రైతు నేస్తం కార్యక్రమం ద్వారా వ్యవసాయ శాఖ మరియు ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం సహకారంతో రైతులకు నేరుగా శాస్త్రవేత్తల ద్వారా వివిధ సాంకేతిక సాగుకు సంబంధ అంశాలపై అవగాహనలో భాగంగా రైతు నేస్తం కార్యక్రమం విధానంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ వారం ముఖ్యంగా ఈ వేసవికాలంలో మామిడి పండ్ల తోటల సాగు యాజమాన్య పద్ధతులు చీడపీడల నివారణ నీటి యాజమాన్య పద్ధతులు అధిక దిగుబడులు సాధించడానికి వివిధ సాంకేతిక అంశాలను గూర్చి ప్రముఖ శాస్త్రవేత్త హరికాంత్ పండ్ల పరిశోధన స్థానం సంగారెడ్డి వారు రైతుల కు వివరించడం జరిగింది అనంతరం వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త అయినటువంటి సయ్యద్ అహమ్మద్ గారు ఈ వేసవికాలంలో వివిధ పంటల్లో తీసుకోవాల్సిన చీడపీడల యాజమాన్యం మరియు నీటి యాజమాన్య పద్ధతుల గూర్చి వచ్చే వానాకాలంలో నేల సంరక్షణ కోసం మరియు సేంద్రియ కర్బన పదార్థం పెంపు కోసం పచ్చిరొట్ట పంటలైనటువంటి జీలుగా జనుము పంటల సాగు విధానం గూర్చి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు రాజ్ నారాయణతో పాటుగా వ్యవసాయ విస్తీర్ణ అధికారులు సాయి కృష్ణ ప్రవీణ్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!