రంజాన్ మాసంలో ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చెయ్యాలి.

Ramzan Ramzan

రంజాన్ మాసంలో ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చెయ్యాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

మార్చి 2వ తేదీ నుండి ప్రారంభం కానున్న రంజాన్ మాసం ఏర్పాట్లుపై సమీక్ష సమావేశం నిర్వహించడం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం ఐడిఓసి కార్యాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో
రెవెన్యూ, పోలీస్, పంచాయతి రాజ్, మున్సిపల్, విద్యుత్, ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు.

Ramzan
Ramzan

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని మసీదుల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రం చేయాలని మున్సిపల్, పంచాయతి అధికారులను ఆదేశించారు. సురక్షిత మంచినీటిని సరఫరా చేయాలని తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ప్రత్యేక ప్రార్థనా సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర
వ సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలని విద్యుత్తు అధికారులకు సూచించారు. ఏదేని విద్యుత్తు సమస్య వచ్చినా తక్షణమే స్పందించేందుకు మసీదు పెద్దలకు ఆ ప్రాంతం యొక్క లైన్ మెన్ ఫోన్ నెంబర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. భూపాలపల్లి, కాటారం, మహాదేవ పూర్ మండలాల్లో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని పోలీస్ అధికారులకు సూచించారు. ప్రార్ధనా మందిరాల వద్ద పట్టిష్టమైన బందోబస్తు ఏర్పాటు ఉండాలని తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాస ప్రార్థనలు చేస్తారని వారికి ఎలాంటి ఆటంకాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో సంతోషంగా రంజాన్ పండుగను ప్రజలందరూ జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు తెలియజేసిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, మైనార్టీ సంక్షేమ అధికారి శైలజ, డిఎస్పి సంపత్ రావు, విద్యుత్ శాఖ ఎస్ ఈ మల్చూర్ నాయక్, డిపిఓ నారాయణ రావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!