30వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్ష

మంచిర్యాల:- నేటిదాత్రి

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాలలో గల శాలివాహన పవర్ ప్లాంట్ మూసివేసి 26 నెలలు గడుస్తున్న కార్మికులకు రావలసిన బెనిఫిట్స్ కంపెనీ యాజమాని మల్కా కొమురయ్య ప్రస్తుతం బిజెపి పార్టీ నుండి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేయుచున్న అభ్యర్థి కార్మికులకు రావలసిన బెనిఫిట్స్ చెల్లించకపోవడంతో కార్మికుల హక్కుల సాధన కోసం కార్మికులు రిలే నిరాహార దీక్షకు పోనుకోవడం జరిగింది. అందులో భాగంగానే పవర్ ప్లాంట్ గేట్ ముందు ఈరోజు 30వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగుతు ఉంది. ఇప్పటికైనా కార్మికులకు రావలసిన బెనిఫిట్స్ చెల్లిస్తానని ఒప్పుకొని యాజమాన్యం ముందుకు రాని పక్షంలో కంపెనీకి సంబంధించిన భూములలో గుడిసెలు వేసుకోనైన కార్మిక హక్కులను సాధించుకోవడానికి
సిద్ధంగా ఉన్నాము , అదేవిధంగా కంపెనీకి సంబంధించిన భూములను ఎవరు కొనడానికి ముందుకు వచ్చిన కచ్చితంగా అడ్డుకుంటామని కార్మిక సంఘం తరఫున హెచ్చరిస్తున్నాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!