బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు.

చిట్యాల, నేటి ధాత్రి :

తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు అల్లం రవీందర్ కేక్ కట్ చేసి, మిఠాయి పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు అనంతరం మండల కేంద్రంలోని చిట్యాల సివిల్ దవఖానాలో రోగులకు, బాలింతలకు పండ్లు, బ్రెడ్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన మాజీ జెడ్పిటిసి గొర్రె సాగర్ మాట్లాడుతూ..కేసీఆర్ రాష్ట్రం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి రాష్ట్రం సాధించారని తెలిపారు. ప్రాంత అభివృద్ధి, అన్నివర్గాలకు సమన్యాయం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని తెలిపారు. తెలంగాణ ప్రజలు కన్న కలలు సాకారం కావాలంటే రాబోవు రోజుల్లో కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాక్షించారు.
భగవంతుడి ఆశీర్వాదంతో నిండు నూరేళ్లు చల్లగా, ఆయురోగ్యాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొత్తూరి రాజిరెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్ బాబు మండల యూత్ అధ్యక్షులు టౌటం నవీన్ మహిళా అధ్యక్షురాలు ఈర్ల మల్లక్క శ్రీదేవి ఎరుకొండ రాజేందర్ మడికొండ రవీందర్ రావు కట్రేవుల కుమార్ సాద మల్లయ్య నాగరాజు పాండ్రాల విరాస్వామి చిలుముల రమణ చారి దుదిపాల తిరుపతి రెడ్డి పెరుమడ్ల రవీందర్ ఏరుకొండ రఘు వెంకట్ నాయక్ పల్లే శశిధర్ రెడ్డి దామర రాజు రాకేష్ భానోత్ శ్రీనివాస్ నాయక్ పోషాల రాజు నరేష్ మొగిలి కట్టేకొల్ల పెద్ద రాజు సాదా రాజు కుస ప్రశాంత్ కట్కూరి రాజేందర్ అశోక్ ప్రశాంత్ పార్టీ నాయకులు మహిళా నాయకులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!