తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు భీమా సౌకర్యం కల్పించడం అభినందనీయం.
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద చేతుల మీదుగా జర్నలిస్టులకు ఉచిత ప్రమాద బీమా పత్రాల అందజేత
యూనియన్ జర్నలిస్టులకు ఉచిత ప్రమాద బీమా పత్రాలు అందజేత. జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయం
*_ టీ.ఎస్.జే.యు రాష్ట్ర అధ్యక్షుడు నారగోని పురుషోత్తం గౌడ్.
వరంగల్, నేటిధాత్రి.
తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (టీ.ఎస్.జే.యు) ఆధ్వర్యంలో, యూనియన్ లో ఉన్న జర్నలిస్టులకు ఐదు లక్షల రూపాయల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం గౌడ్ నారగోని అన్నారు. శుక్రవారం వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద చేతుల మీదుగా జర్నలిస్టులకు బీమా పత్రాలు అందజేశారు. వరంగల్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి జర్నలిస్టులు వ్యక్తిగత జీవిత భీమా ఉండాలని, తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ప్రమాద భీమా సౌకర్యం కల్పించడం అభినందనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నారగోని పురుషోత్తం గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, నరేష్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కందికొండ మోహన్, జిల్లా ఉపాధ్యక్షుడు కందికొండ గంగరాజు, లింగబత్తిని కృష్ణ, బత్తుల సత్యం, ప్రధాన కార్యదర్శి ఆవునూరి కుమారస్వామి, భాగ్యరాజ్, ఈద శ్రీనాథ్, అడుప అశోక్, నాగపురి నాగరాజు, అశోక్, అవినాష్, మోహన్, సురేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.