కన్నులపండుగలా విగ్రహాల ప్రతిష్ట మహోత్సవం
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం ప్రతిపాక గ్రామంలో జరుగు తున్న ఆదిత్యాది నవగ్రహ పునః ప్రతిష్ట మరియు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన భూపాలపల్లి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతిని పత్తిపాక భక్త బృందం వారికి ఘన స్వాగతం పలికారు, అనంతరం దేవతామూర్తుల దర్శనం చేసుకుని, భక్తులతో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, మండల యూత్ అధ్యక్షులు మారపల్లి మోహన్, గ్రామ శాఖ అధ్యక్షులు పసుల ప్రవీణ్ కుమార్, గాదె రాజేందర్, దాసి శ్రావణ్ కుమార్ మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మారపల్లి నందం, ముఖ్య నాయకులు గంటా శ్యాంసుందర్ రెడ్డి దంపతులు, సావుళ్ళ కిష్టయ్య, కరుణ్ బాబు, బండ నారాయణరెడ్డి, పల్లవేనా రామరాజు గజ్జిరాజు, పోతుగంటి సుభాష్, మాందాడి రాజు, కుసుమ రమేష్ తదితరులు పాల్గొన్నారు.