అధికారులు ఎమ్మెల్యే న్యాయం చేయాలి
య౦ఏ ఖాదర్ పాష జనసమితి జిల్లా అధ్యక్షులు
వనపర్తి నేటిధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరే విదంగా అధికారులు మంత్రి జుపల్లి ఎమ్మెల్యే తూడి మేగారెడ్డి రాష్ట్ర ప్లానిoగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి ని తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు య౦ఏ ఖాదర్ పాష.కోరారు. శుక్రవారం ఉదయం పట్టణంలోని వి వి ద వార్డు లలో ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డుల 500 గ్యాస్ 33 వ వార్డు లో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఇంటి ఏరియాలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చెసిన గ్యాస్ సిలిండర్ 500 ప్రజల.కు అందడం లేదనిసర్వే లో ప్రజలు తెలంగాణ జనసమితి దృష్టి కి తెచ్చారని ఖాదర్ తెలిపారు ఈ సందర్భంగా ఖాదర్ పాష మాట్లాడుతూ, కులదరణ సర్వే ఆధారంగా రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక జరగాలని అన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు గుర్తించి వారికి ఇందిరమ్మ ఇల్లు అందేవిధంగా చూడాలని పాత ఇళ్ల నిర్మాణం ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వన్ని కోరారు. వర్షాకాలంలో ఇల్లు కూలిపోయిన బాధితులను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం న్ని డిమాండ్ చేశారు. వనపర్తి లో వివిధ వార్డుల్లో అదికారులు చేపట్టిన సర్వే లలో పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా చేపట్టి అర్హులకు అందరికీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ పథకాలు అందే విధంగా ప్రజలకు న్యాయం చేయాల.ని అన్నారు తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుని వెంట సర్వే లో వెంకటస్వామి. సాయిబాబా. మహబూబ్ తదితరులు పాల్గొన్నారు.