నల్లబెల్లి, నేటి ధాత్రి:
మండల కేంద్రానికి చెందిన రేషన్ డీలర్ జన్ను ప్రభాకర్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా విషయం తెలుసుకున్న ములుగు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ జగదీశ్వర్ మృతుని స్వగృహానికి చేరుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం మృతిని కుటుంబ సభ్యులను ఆత్మీయ బహుజన పలకరింపు చేసి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదని ప్రతి కుటుంబంలో ఈ విషాద సంఘటనలు ఉంటాయని అలాంటి సందర్భంలో కుటుంబ సభ్యులను ఓదార్చే క్రమంలో కడుపు చల్ల పేరుతో మద్యాన్ని, మాంసాన్ని ఇవ్వడం వల్ల ఆర్థిక నష్టం తో పాటు అనారోగ్య నష్టం కూడా వాటిల్లుతుందని వాటికి బదులు పండ్లు, పండ్ల రసాలు, డ్రై ఫ్రూట్స్ లాంటి శాస్త్రీయ ప్రత్యామ్నాయ సంస్కృతిని ప్రతి ఒక్కరు అమలు చేసే దిశగా కడుపు చల్ల కార్యక్రమం నిర్వహించాలని అన్నారు కార్యక్రమంలో గాదె ఇసాక్ స్పేరో లెక్చరర్, సోషల్ థింకర్స్ ఫోరం బాధ్యుడు రఘుపతి, కోర్ర రమేష్, వినయ్ స్వేరో, మాజీ ఎంపిటిసి జన్ను జయరాజు, పరికి రత్నం, కొండి అశోక్, రఘువరన్, తదితరులు ఉన్నారు.