పాఠశాల క్యాలెండర్ ఆవిష్కరణ.

#క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన ఎంపీడీవో నరసింహమూర్తి.

నల్లబెల్లి, నేటి ధాత్రి: 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ మండలంలోని నాగరాజు పల్లె, పంతులుపల్లి, ప్రాథమిక పాఠశాలలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో నరసింహమూర్తి, ఎంపీ ఓ అంబి సమంత హాజరై ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల ఫోటోలతో క్యాలండర్ను తయారుచేసి ఉచితంగా పంపిణీ చేసిన ఉపాధ్యాయుడు రాజన్ బాబును అభినందించడం హర్షించదగ్గ విషయం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై మక్కువ చూస్తున్న ఇలాంటి ఉపాధ్యాయులకు చేదోడువాదాడుగా ఉండే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఉండాలని పలువురు కోరారు అలాగే తాను తీసుకున్న మొదటి జీతం నుంచి క్యాలెండర్స్ అందజేసిన ఉపాధ్యాయుడికి పలువురు ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఎరుకల వెంకటలక్ష్మి, మాజీ సర్పంచ్ గోన శ్రీదేవి, ఆసం చంద్రమౌళి, పంచాయతీ కార్యదర్శులు విష్ణు, సుధాకర్ పాఠశాల ఉపాధ్యాయులు ఉడుత రాజేందర్, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!