ఫాతిమా షేఖ్ జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయుల సన్మానం

కామారెడ్డి జిల్లా/బిచ్కుంద నేటి ధాత్రి:

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం లోగల హాజ్గుల్ గ్రామ ఎంపీపీ ఎస్ ప్రభుత్వ పాఠశాలలో భారతదేశ తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ జయంతిని పురస్కరించుకొని పలువురు మహిళా ఉపాధ్యాయులను ఎస్జీటీ ఉపాధ్యాయ యూనియన్ తరపున సన్మానించారు. సన్మానించబడిన వారిలో మహిళా ఉపాధ్యాయులు శాంత, సమ్రీన్ బేగం, జవేరియా శబ్నం, లక్ష్మి, అస్మ, సల్మానాజ్, జయశ్రీ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ జి టి యు స్టేట్ సెక్రటరీ విజయ్ పాటిల్, జడ్.పి.హెచ్.ఎస్ అజ్గుల్ ఉర్దూ మీడియం ప్రధాన ఉపాధ్యాయుడు గాండ్ల రమేష్, ఎస్ జి టి యు బిచ్కుంద అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేఖ్ ఖయ్యూమ్- టీ.మారుతి, మండల ప్రత్యేక సలహాదారు ఆన్సర్ ఘోరీ, ఉపాధ్యక్షులు షేఖ్ చాంద్ – రవి జాదవ్, కోశాధికారి షేఖ్ నహీమ్, ఫైముదా మరియు ఉపాధ్యాయ వర్గం, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!