రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలి

*గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :*

గుండాల మండలం లోని రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని వాహనదారులకు గుండాల ఎస్సై రాజమౌళి, ఆళ్లపల్లి ఎస్సై రతీష్ మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోటార్ సైకిల్ పై హెల్మెట్ ధరించి ప్రయాణించాలని, ఇద్దరి కంటే మించరాదని, అధిక బరువు, అతివేగం, మద్యం సేవించి వాహనం నడపకూడదని, లైసెన్సులు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ఈ విధంగా భద్రత నియమాలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని వారు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!