దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంర్..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జనవరి 26 రిపబ్లిక్ డే నుండి రైతు భరోసా 6000 ఇస్తున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో రైతు భరోసా ను 6000 కు పెంచుతూ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లో కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతులు, స్థానిక నాయకులు ముఖ్యమంత్రి కి, ఉప ముఖ్యమంత్రి కి పాలాభిషేకం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొని, అనంతరం రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ గత ప్రభుత్వ పాలకులు రాళ్లకు, రప్పలకు, గుట్టలకు రైతుబంధు పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో షరతులు లేకుండా సాగు చేస్తున్న వ్యవసాయ భూములన్నింటీకీ రైతు భరోసా ఇస్తామన్నారు అదేవిధంగా రిపబ్లిక్ డే నాడు భూమిలేని అర్హులైన నిరు పేదలకు ఏటా రూ.12 వేలు ఇస్తామన్నారు, త్వరలో రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.
బీఆర్ఎస్ సర్కార్ పదేండ్లు వాగ్ధానాలు, మాటలతోనే మోసం చేసింది తప్పితే రూ. లక్ష కూడా సక్రమంగా రుణమాఫీ చేయలేదన్నారు. ఇచ్చిన ఆ కాస్తా డబ్బులు కూడా నాలుగు విడతలుగా ఇవ్వడంతో అదంతా వడ్డీలకే సరిపోయిందన్నారు. రుణమాఫీ చేయలేని కేటీఆర్, హరీశ్రావు తమ ప్రభుత్వంపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు, నిన్న నిరసన పేరుతో చేసిన ధర్నాలో బిఆర్ఎస్ కార్యకర్తలు తప్ప రైతులను లేరన్నారు.
ఆర్థికంగా సమస్యలున్నా.. రూ.22 వేల కోట్లతో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామని తెలిపారు. ”ధాన్యం కొనుగోళ్లలో క్వింటాల్కు రూ.500 బోనస్ ఇచ్చామని. గతేడాది కేసీఆర్ ఎగొట్టిన 7500 కోట్ల రైతుబంధును ఇచ్చి అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని. ఇది కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.
ఏసీబీ విచారణను కప్పిపుచ్చుకునేందుకు నిన్న నిరసనల పేరుతో బిఆర్ఎస్ డ్రామా చేసిందని, ఫార్ములా ఈ రేసు కేసు లో కేటీఆర్ తప్పు చేసింది నిజమని, కేటీఆర్ దోచుకున్నది నిజమని, కేసులో కేటీఆర్ దోషి అనేది నిజమని అన్నారు అది తెలుసు కాబట్టే కేటీఆర్ విచారణ ఎదుర్కొవడానికి భయపడుతున్నాడని కేటీఆర్ కు కోర్టులో శిక్ష తప్పదని అన్నారు.