పురవీధుల్లో అయ్యప్ప స్వాముల భజన
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి నగర సంకీర్తనలు చేయడం జరిగింది.మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాలు చరిత్ర గలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాల యంలో మంగళవారం రాత్రి అయ్యప్ప స్వామి నగర సంకీర్తన దేవాలయ చైర్మన్ గురుస్వామి సామల బిక్షపతి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి అయ్యప్ప పంచలోహ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం ప్రత్యేక పూజలు చేసినారు అనంతరం అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో అమర్చి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా అయ్యప్ప భక్తి పాటలతో భజనలతో నగర సంకీర్తన అంగరంగ వైభవంగా జరిగింది భక్తులు స్వామి వారికి మంగళ హారతులు ఇచ్చి టెంకాయలు కొట్టి నారు అనంతరం దేవాలయంలో చింతల శ్రీనివాస్ రెడ్డి శ్వేతా రెడ్డి దంపతులు అయ్యప్ప మాల ధరించిన స్వాములకు భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో దిడ్డి రమేష్ బొల్లపల్లి సదానందం శ్రీధర్ రెడ్డి వినుకొండ రాజ్ కుమార్ కందగట్ల రమేష్ భాసని మల్లికార్జున్ బాలకృష్ణ గట్టు కిషన్ మార్త సుమన్ గోరంతల ప్రశాంత్ లోకల బోయిన కుమారస్వామి రాజు బాబురావు ప్రభాకర్ రాజేశ్వరరావు ఉమా శంకర్ శ్రీకాంత్ హరిబాబు మాధవ చంటి కొత్తపెళ్లి రవీందర్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.