
కలెక్టర్ ప్రావీణ్య కి వినతి పత్రం ఇచ్చిన బిఎస్యు, ఎబిఎస్ఎఫ్ నాయకులు
హన్మకొండ, నేటిధాత్రి :
బి ఎస్ యు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మంద సురేష్
ఎబిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నాగుల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ
24 వ తేదీన శ్రీ దేవి గుగులోత్ ఆత్మహత్య కు ఏకశీల యాజమాన్యం బాధ్యత వహించాలని అన్నారు, అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను మనోవేదనకు గురిచేస్తూ ఆత్మహత్యకు కారణం అయిన కళాశాల పర్మిషన్ రద్దు చేయాలనీ వినతి పత్రంలో కోరినట్టు తెలిపారు. అడ్డగోలుగా అనుమతి లేకుండా హాస్టల్స్ నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారని అన్నారు.కళాశాల హాస్టల్స్ పేరుతో విద్యార్థుల భవిష్యత్ నాశనం చేస్తున్న అన్ని హాస్టల్స్ ను రద్దు చేయాలనీ కోరమన్నారు.