సిపిఐ 25వ వార్డ్ మహిళ విభాగం. నాయకురాలు పెద్దమాముల సంధ్య, బల్ల సత్యవతి.
భూపాలపల్లి నేటిధాత్రి
కారల్ మార్క్స్ కాలనీ 25 వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతు.. మహిళలు సమస్యల గురించి మాట్లాడితే.. కాలనీలో అందుబాటులో లేకుండా.. వేరొక చోట ఉంటూ అందుబాటులో లేడని మాట్లాడితే మాట్లాడిన మహిళలపై ఎదురుదాడి చేయడం సిగ్గు సిగ్గు అని 25 వ వార్డు సిపిఐ మహిళా సంఘం నాయకురాలు.. పెద్దమాముల సంధ్య, బల్ల సత్యవతి అన్నారు స్థానిక రావి నారాయణరెడ్డి భవన్లో వారు మాట్లాడుతూ.. గత మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐ పార్టీ తరఫున గెలిచి అభివృద్ధి పేరిట మూడు పార్టీలు మారి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి, అందుబాటులో ఉంటాడని ఓట్లు వేసి గెలిపించిన తర్వాత ఇక్కడి నుండి వెళ్లి వేరొక చోట నివాసం ఉంటూ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు, కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయని ముఖ్యంగా వాటర్ సమస్య, కోతుల బెడద, కుక్కల బెడద, అంతర్గత పారిశుద్ధ్యం, స్ట్రీట్ లైట్లు, ఇవే కాకుండా ఇంకేమైనా సమస్యలు ఉన్న చెప్పుకుందామని అనుకుంటే అందుబాటులో లేకుండా వేరొక చోట ఉండడంవల్ల స్థానిక మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన తరుణంలో ఎవరైతే సమస్య పరిష్కరించాలని కోరుతారో వారి మీద మీరు గొడవ చేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయా అని, ఒక్క సిపిఐ పార్టీ వల్లనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఇష్టం వచ్చినట్లు బెదిరించే విధంగా మాట్లాడడం సమంజసం కాదన్నారు, సిపిఐ పార్టీ వల్లనే నువ్వు కౌన్సిలర్ గా గెలిచావు అనే విషయాన్ని మరిచిపోవద్దని అన్నారు మీరు కాలనీలో ఉండి సమస్యలు పరిష్కరించాలి తప్ప, సమస్య తీసుకపోయిన వారి పైన మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు
ఈ కార్యక్రమంలో సిపిఐ 25వ వార్డు మహిళా నాయకురాలు.. పల్లెర్ల రజిత, నాగమణి, తోపాటు మిగతా నాయకురాలు పాల్గొన్నారు..