మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రం, పూర్వ ప్రాథమిక పాఠశాల -2 వెనుక భాగంలో మ్యాన్ హోల్ కు మూత లేకపోవడంతో గత 6 నెలలుగా కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. మ్యాన్ హోల్ కు మూత ఏర్పాటు చేయాలని గ్రామపంచాయతీ సిబ్బందికి తెలిపిన పట్టించుకోవడంలేదని కాలనీవాసులు ఆగ్రహ వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఈ రోడ్డు గుంట అంగన్వాడి కేంద్రానికి 10 మంది చిన్నారులు వెళ్తుంటారు. ఏదైనా ప్రమాదం జరిగితే.. ఎవరు బాధ్యులని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి మ్యాన్ హోల్ కు మూత బిగించాలని చిన్నారుల తల్లిదండ్రులు, కాలనీవాసులు, బాటసారులు కోరారు
మ్యాన్ హోల్ మూత లేక.. 6 నెలలుగా ఇబ్బందులు.
![](https://netidhatri.com/wp-content/uploads/2024/12/WhatsApp-Image-2024-12-30-at-2.32.14-PM.jpeg)