ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను ముక్తకంఠంతో వ్యతిరేకించిన కేయూ విద్యార్థి సంఘాలు

హన్మకొండ, నేటిధాత్రి :

ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో తీవ్రమైన నష్టం జరుగుతుందని సమాజంలో వెనుకబడి ఉన్న బడుగు బలహీన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల ఆర్థిక సామాజిక రాజకీయ రాజకీయ రంగాలలో తీవ్ర నష్టం జరుగుతుందని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని వివిధ విద్యార్థి సంఘల నాయకులు అన్నారు.
ఈరోజు కాకతీయ యూనివర్సిటీ లోనీ జాఫర్ నిజాం సెమినార్ హాల్లో జరిగిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ వర్గాలకు అన్యాయం అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఎంఎస్ఎఫ్ సీనియర్ నాయకులు మంద భాస్కర్ , ఏబిఎస్ఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్, బిఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు కాకతీయ యూనివర్సిటీ ఇంచార్జ్ బొట్ల మనోహర్, కాకతీయ యూనివర్సిటీ కురుస ప్రెసిడెంట్ హుస్సేన్ నాయక్, ఎస్ ఎస్ బి ఎం బి ఎం వ్యవస్థాపక అధ్యక్షులు కంటెస్టెంట్ ఎమ్మెల్సీ గాదపాక అనిల్ కుమార్,బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆల్ యూనివర్సిటీస్ ఇన్చార్జ్ అరగంటి నాగరాజు, డిఎస్ఎ రాష్ట్ర కన్వీనర్ కామగోని శ్రావణ్, స్వేరోస్ పీపీఎల్ రాష్ట్ర కో కన్వీనర్ చాతర్ల సదానందం, పి డి ఎస్ యు కాకతీయ యూనివర్సిటీ ఇంచార్జ్ వంశీకృష్ణ , డి ఎస్ యు కాకతీయ యూనివర్సిటీ ఇంచార్జ్ మహారాజ్ , స్వేరోస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అమ్మఒడి సుభద్ర శ్యామల ,సేవాలాల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతి నాయక్, టీఎస్ ఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు శ్రీధర్ ,స్వేరోస్ సీనియర్ నాయకులు ,బోట్ల కార్తీక్ ,వేణుగోపాల్ వివిధ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!