రబీ ధాన్యంపై రైస్ మిల్లింగ్ పై సమీక్ష అదనపు కలెక్టర్ అశోక్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

రబీ 2022-23 వేలం ధాన్యం రబీ 2023-24 కస్టమ్ మిల్లింగ్ రైస్ పై సమీక్ష అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రబీ 2022-23లో వేలం వేసిన ధాన్యాన్ని 2024 డిసెంబర్ 31లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, రబీ 2023-24 కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ప్రక్రియను వేగవంతం చేయాలని మిల్లర్లకు సూచించారు. ప్రభుత్వ నిబంధనలు మరియు సమయ పరిమితులను పాటిస్తూ అన్ని ప్రక్రియలను సకాలంలో పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు.
రైస్ మిల్లర్లు తగిన చర్యలు తీసుకోవాలని నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాధ్, డిఎం రాములు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!