సమ్మెలో టీచర్లు.. సిలబస్ కాకపోవడంతో విద్యార్థుల ఆందోళన.

నవాబుపేట /నేటి ధాత్రి.

నవాబుపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులు శనివారం పాఠశాల ఆవరణలో టీచర్లు పాఠశాలకు రావడంలేదని నిరసన చేపట్టారు. పాఠశాలకు టీచర్లు హాజరు కావాలన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. గత 19 రోజులుగా టీచర్లు పాఠశాలకు రాకపోవడంతో నవంబర్, డిసెంబర్ నెల సిలబస్ పూర్తి కాలేదని, పాఠాలు బోధించకపోవడంతో మార్కులు తక్కువగా వస్తే..మా భవిష్యత్తు ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. వార్షిక పరీక్షల తేదీలు వచ్చాయని.. ప్రిపరేషన్ అవుదామంటే టీచర్ లేక అవస్థలు పడుతున్నామన్నారు. టీచర్లు రాకపోతే మా భవిష్యత్తు అంధకారం అవుతాదన్నారు. మా పరిస్థితిని చూసి మా తల్లిదండ్రులు తమ పిల్లకు మార్కులు తక్కువగా వస్తాయని ఆందోళన చెందుతున్నారన్నారు. ఉన్నతాధికారులు స్పందించి టీచర్లు పాఠశాలకు హాజరయ్యేటట్లు చూడాలని కోరారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని,తహశీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో జయరాం నాయక్, ఎస్సై విక్రమ్ విద్యార్థులకు హామీ ఇచ్చి ధర్నా విరమింప చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!