జైపూర్,నేటి ధాత్రి:
బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావ్,జిల్లా ప్రధానకార్యదర్శి చెన్నూర్ అసెంబ్లీ కంటిస్టెంట్ అభ్యర్ధి దుర్గం అశోక్ ఆదేశాల మేరకు భీమారం మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు బోర్లకుంట శంకర్ ఆధ్వర్యంలో గురువారం రోజున వీర్ బల్ దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.సిక్కుల గురువు గురు గోవింద్ జీ కుమారులు 6 సంవత్సరాల పతే సింగ్,అతని అన్నయ్య 8 సంత్సరాల జోరావర్ సింగ్ హిందుత్వం లోంచి ఇస్లాంలోకి మారడానికి నిరాకరించినందుకు సిధ్వాండ్ నవాబ్ వజీర్ ఖాన్ చేతిలో అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు.సనాతన ధర్మం కోసం వారు చేసిన ప్రాణ త్యాగాలకు స్మరణగా,ఇస్లామిక్ మూర్ఖపు మతోన్మాదానికి బలైపోయిన ఈ అమర వీరుల వీరోచిత ధైర్యానికి గుర్తుగా గురువారం రోజున దూదాని అమృత్ సింగ్,జగదీష్ సింగ్ ల ఇంటి వద్ద సిక్కు గురువు గురుగోవింద్ జీ,ఫతే సింగ్,జోరావర్ సింగ్ ల చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జీ ఆలం బాపు,మండల ప్రధానకార్యదర్శి మాడెం శ్రీనివాస్,ఉపాధ్యక్షులు గజ్జెల సురేష్,ఓబీసీ మోర్చ అధ్యక్షుడు సురేష్ పాల్గొన్నారు.