ఓపెన్ టెన్త్,ఇంటర్ గడువు పొడిగింపు

జైపూర్,నేటి ధాత్రి:

ఓపెన్ టెన్త్,ఇంటర్ గడువు రాష్ట్ర విద్యాశాఖ పొడిగించినట్లు జైపూర్ అధ్యయన కేంద్ర సహాయ సమన్వయకర్త సత్తయ్య జంబోజు ఒక ప్రకటనలో తెలిపారు.ఓపెన్ టెన్త్ లో ప్రవేశానికి పుట్టిన తేదీ తెలియజేయడానికి టిసి, రికార్డు షీట్, మండల రెవెన్యూ అధికారి ఇచ్చిన పుట్టిన తేదీ సర్టిఫికెట్ సరిపోతుందని ఎటువంటి విద్యార్హత లేకుండా టెన్త్ పూర్తి చేసుకోవడానికి మంచి అవకాశం అని తెలిపారు.అలాగే టెన్త్ ఉత్తీర్ణులై కాలేజీకి వెళ్లకుండా ఇంటర్ పూర్తి చేసుకోవచ్చని సెలవు రోజులలో తరగతులు నిర్వహించబడతాయని అన్నారు.ఈ అవకాశాన్ని వినియోగించుకొని విద్యార్హతలు పొంది అన్ని రకాల పోటీ పరీక్షలు రాసి ఉద్యోగాలు చేయవచ్చని, పై చదువులు రెగ్యులర్ గా చదవచ్చని తెలియజేశారు. ఏవైనా వివరాల కొరకు జిల్లా పరిషత్ జైపూర్ అధ్యయన కేంద్ర సమన్వయకర్త ప్రధానోపాధ్యాయులను సంప్రదించవచ్చని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!