మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్ సి ) లో 102 వాహనాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి (జీఎంర్ ), ప్రారంభించరు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు వైద్య సేవల కోసం ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించకుండా 102(అమ్మ వాహనం) అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో పీహెచ్ సి డాక్టర్స్ అడ్డాకుల మండలం లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.