నిజాయితీ చాటుకున్న సింగరేణి సివిల్ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

మందమర్రి ఏరియా లోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల ఆర్ కే సి ఓ ఏ క్లబ్ ఎదురుగా ఉన్న స్పెషల్ ఏ -17 క్వార్టర్ లో నివాసముంటున్న సింగరేణి అధికారి జయంత్ కుమార్ ఎస్ ఆర్ పి లో ఉన్న ఓపెన్ కాస్ట్ గనిలో అడిషనల్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు, మంగళవారం ఉదయం బి – జోన్ సివిక్ మెయింటెనెన్స్ లో భాగంగా తన ఇంటికి చెత్త తీసుకో వెళ్లడానికి వచ్చిన ట్రై సైకిల్ లో చెత్తను వేయడం జరిగింది, పారవేసిన చెత్తలో సుమారు 40000 రూపాయలు విలువ గల 5 గ్రాముల బంగారు ఉంగరం పోయింది ఇట్టి విషయం గ్రహించిన సదరు అధికారి సివిల్ సూపర్వైజర్ సదానందం కి ఫోన్ చేసి జరిగిన విషయం తెలియజేశారు, ఆయన వెంటనే స్పందించి చెత్త బండి కార్మికుడైన ఫతకాల శాంత్ కుమార్, ఇతర మహిళా కార్మికులు చెత్తను పారవేసిన డంపు యార్డ్ కాడ గంటసేపు చేత్త లో వెతకగా దొరికిన ఆ ఉంగరాన్ని అధికారి కుటుంబానికి అప్పగించి తమ ఉదార స్వభావాన్ని చాటుకున్నారు, తమ పోగొట్టుకున్న ఉంగరాన్ని వెతికి అప్పగించిన బి జోన్ పారిశుద్ధ కార్మికుల్ని వారి సూపర్వైజర్ నీ ఆ అధికారి కృతజ్ఞతలు తెలియజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!