నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :
కాటమయ్య రక్షణ కవచాలను కల్లుగీత వృత్తి చేసే నిజమైన గీత కార్మికులకు ఇవ్వాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగాని సీతారాములు అన్నారు.శనివారం నల్లగొండలోని వృత్తిదారుల కార్యాలయంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా నిజమైన కల్లుగీత కార్మికులకు సేఫ్టీ మోకులు ఇవ్వాలనిఆయన అన్నారు. కాటమయ్య రక్షణ కవచాలను అర్హులకు ఇవ్వకుండా వృత్తిలో లేనివారికి ఇవ్వడం వలన నిజమైన కల్లుగీత కార్మికులకుతీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు గీత కార్మికులకు అనేక వాగ్దానాలు ఇచ్చి అమలు చేయడంలో విస్మరించిందన్నారు. ఈ జిల్లాలో 25వేల మంది కల్లుగీత వృతిపై ఆధారపడి జీవిస్తున్నారని, తాటి చెట్టుఎక్కే క్రమంలోప్రమాదం జరిగివందలాదిమందిగీత కార్మికులుకాళ్లు చేతులు విరగడంనడుము విరిగిపోవడం చనిపోవడంజరుగుతుందన్నారు.ప్రమాదాలు నివారించడానికి తక్షణమే సేఫ్టీ మొకులు అందించి గీత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగిభూములకు ధరలు పెరగడంతో తాటి, ఈత చెట్లను నరికి వేస్తున్నారని, ఎన్నోసార్లు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసిన నామా మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారనిఆయన అన్నారు.తాటి,ఈత చెట్లనునరికిన వారిపై నాన్ బేయిలబుల్ కేసులు పెట్టి కఠినంగా శిక్షించే విధంగాచట్టం తీసుకురావాలని అన్నారు.గత ప్రభుత్వం నెక్లెస్ రోడ్ లో నీరా కేఫ్ ఏర్పాటు చేసిందని, దీనినిటాడి కార్పొరేషన్ ద్వారా నిర్వహించిజిల్లాలకు విస్తరింప చేయాలని అన్నారు. ప్రమాదానికి గురై చనిపోయిన కుటుంబాలకు,శాశ్వత వికలాంగులకు 10 లక్షలు ఎక్స్గ్రేషియానెలరోజుల్లోపు ఇవ్వాలని, మెడికల్ బోర్డు విధానం తొలగించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చేతి వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ గంజి మురళి,తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘంజిల్లా గౌరవ అధ్యక్షులుపామన గుండ్ల అచ్చాలు,జిల్లా ఉపాధ్యక్షులుఉప్పల గోపాల్, జిల్లా సహాయ కార్యదర్శిలు రాచకొండ వెంకట్ గౌడ్, జెర్రిపోతుల ధనంజయతదితరులు పాల్గొన్నారు.
కాటమయ్య రక్షణ కవచాలను కల్లుగీత కార్మికులకు ఇవ్వాలి: తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగాని సీతారాములు
