చిట్యాల,నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో మంగళవారం రోజున భూపాలపల్లి డి.ఎస్.పి సంపత్ రావు చెకుముకి సైన్స్ సంబరాల 2024 పోస్టర్ను ఆవిష్కరించారని చెకుముకి సైన్స్ సంబరాల చిట్యాల మండల కన్వీనర్ సూదం సాంబమూర్తి తెలిపారు ఈ సందర్భంగా డి.ఎస్.పి సంపత్ రావు మాట్లాడుతూ విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడానికి ఈ చెకుముకి సైన్సు సంబరాల టాలెంట్ టెస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందని డీఎస్పీ అన్నారు . ఈ కార్యక్రమంలో చిట్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులలో సైన్స్ పై అవగాహన కొరకు ఈ చెకుముకి సంబరాల టాలెంట్ టెస్ట్ నూతన ఆవిష్కరణలకు దోహదపడుతుందని మాట్లాడడం జరిగింది చెకుముకి సైన్సు సంబరాల మండల కన్వీనర్ సూదం సాంబమూర్తి మాట్లాడుతూ నవంబర్ ఏడో తారీఖున పాఠశాల స్థాయిలో నవంబర్ 21న మండల స్థాయిలో చెకుముకి సైన్స్ సంబరాల టాలెంట్ టెస్ట్ ఉంటుందని విద్యార్థులందరూ ఈ చెకుముకి సైన్స్ సంబరాల టాలెంట్ టెస్ట్ కు సిద్ధం కావాలని మండలంలోని అన్ని పాఠశాల విద్యార్థులను కోరారు ఈ కార్యక్రమంలో చిట్యాల మొదటి ఎస్సై శ్రావణ్ కుమార్ రెండవ ఎస్సై ఎండి శాఖన్ ప్రొబేషనరీ ఎస్ఐలు మహేష్ రాజశేఖర్ ఉపాధ్యాయులు కూచనపల్లి శ్రీనివాస్ బండారు సదయ్యలు పాల్గొన్నారు