రైలు కింద పడి మహిళ మృతి
జమ్మికుంట: నేటి ధాత్రి
జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామానికి చెందిన జొన్నల స్వరూప (41) అనే మహిళ ప్రమాదవశాత్తు రైలు కింద పడి మృతి చెందింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం మృతురాలికి ఉన్న తన పత్తి చేనువద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్ళడానికి మార్గ మధ్యలో రైలు పట్టాలు దాటే క్రమంలో దిగువ లైన్ లో వెళ్లే ఇంటర్సిటీ ఎక్సప్రెస్ ప్రమాదవశత్తుగా డీకొనంగా చనిపోయినది. శవాన్ని ప్రభుత్వ హాస్పిటల్ జమ్మికుంట కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.