రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రెండవ వార్డు కనకదుర్గ కాలని కి చెందిన బర్ల లలితమ్మ కుమారుడు బర్ల హర్ష వర్ధన్ ఇటీవల అనారోగ్య కారణాల బారినపడి మరణించిన విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణ దృష్టికి వెళ్లడంతో సోమవారం ఆ కుటుంబానికి స్థానిక కాంగ్రెస్ నాయకుల చేత ఆర్థిక సహాయాన్ని అందించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణ తెలియజేశారని పట్టణ అధ్యక్షులు పల్లె రాజు పేర్కొన్నారు ఆర్థిక సహాయాన్ని అందించిన వారిలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, రెండో వార్డ్ కౌన్సిలర్ ఫుల్లురి సుధాకర్, మహంకాళి శ్రీనివాస్, నీలం శ్రీనివాస్ గౌడ్, బొడ్డు వెంకటేష్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.