ఎంబీబీఎస్ విద్యార్థిని దీప్తికి “ఎంపీ వద్దిరాజు” ఆశీస్సులు

“నేటిధాత్రి” ఖమ్మం
క్రమశిక్షణ,దృఢ సంకల్పం,పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిదంటూ ఏది ఉండదని ఆచరణలో నిరూపించింది సరస్వతి పుత్రిక దీప్తి

పేద కుటుంబానికి చెందిన దీప్తి కష్టపడి చదివి కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సోమవారం ఖమ్మం బురహాన్ పురంలోని తన క్యాంప్ కార్యాలయంలో చదువుల తల్లి దీప్తిని శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు, ఆశీస్సులు అందజేశారు

ఖమ్మం నగరంలోని బొక్కలగడ్డకు చెందిన హమాలీ పని చేసే వెంకటేశ్వర్లు-మంగ దంపతుల కూతురు దీప్తి మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో చదివి పదవ తరగతిలో 10/10, ఇంటర్మీడియట్ లో 1000కి 958 మార్కులు సాధించి అందరి ప్రశంసలు అందుకుంది

ఈ సందర్భంగా దీప్తిని ఎంపీ రవిచంద్రతో కలిసి టీఆర్ఎస్ నాయకులు తోట రామారావు తదితర ప్రముఖులు ప్రశంసించారు, శుభాకాంక్షలు చెప్పారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!