ఎంహెచ్పీఎస్ వ్యవస్థపాక అధ్యక్షులు ఉపేందర్ మాదిగ
పరకాల నేటిధాత్రి
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే అన్ని రాష్ట్రాల కంటే ముందే అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అద్యక్షులు మైస.ఉపేందర్ మాదిగ తెలిపారు.ఎస్సీ వర్గీకరణను పక్కనపెట్టి ఉద్యోగ నియామకాలు చేస్తున్నారని మరోసారి తెలంగాణలో మాదిగ లను ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరాలోచించాలని ఉపసంఘం పేరుతో కాలయాపన చేయొద్దని కోరారు.వర్గీకరణ చేసేదాకా ఉద్యోగ ఖాళీలు చేయొద్దని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగ లకు తీరని అన్యాయం చేస్తుందని మరోసారి తెలంగాణలో మాదిగ మలిదశ ఉద్యమానికి ఈ ప్రభుత్వం ఉసిగోల్పుతుందని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మాదిగల పోరాటం ఎంతో ఉందని మాదిగల కృషి తోనే ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు జాతీయ స్థాయి ఉద్యమానికి సైతం సిద్దమేనని హెచ్చరించారు.