సిపిఎల్ సీజన్ 2 ముగింపు

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న చందుర్తి ప్రీమియర్ లీగ్ సీజన్- 2 క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం ముగిసింది.మొదటి బహుమతి శ్రీనివాస్ స్ట్రైకర్స్ ,రెండో బహుమతి సాయి ఎలేవన్ గెలుచుకున్నాయి. ఇట్టి బహుమతులను, బహుమతుల దాత బద్దం తిరుమల రెడ్డి అందించారు.ముఖ్యఅతిథిగా గుర్రం తిరుమల్ సిఐ హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో బద్దం తిరుమలరెడ్డి పుల్కం మధు, యాకోబు. హమీద్ ,తిరుపతి అజయ్, క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *