శబరిమలకు మహా పాదయాత్ర

నేటి ధాత్రి కథలాపూర్

మెట్పల్లి నుండి శబరిమలకు అయ్యప్ప స్వాములు పాదయాత్ర చేపట్టారు. సుమారు 1600 కిలోమీటర్లు ఈ పాదయాత్ర ఉన్నట్లు గురుస్వామి పోతుగంటి రాజేందర్ తెలిపారు. రాజేందర్ గురుస్వామి ఆధ్వర్యంలో మొదటిసారి పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు, దీనికిగాను 40 మంది స్వాములను పాదయాత్రలకు తీసుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ పాదయాత్ర మెట్పల్లి వేములవాడ సిరిసిల్ల బెంగళూరు నుండి శబరిమలకు బయలుదేరినట్లు తెలిపారు. ఈ పాదయాత్రలో మధ్య మధ్యలో ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేకూరుస్తారు లేదంటే నా సొంతంగా తీసుకెళ్తానని నిశ్చయించుకున్నట్లు పోతుగంటి రాజేందర్ తెలిపారు. ఇది సుమారు జనవరి 5 వరకు అక్కడ చేరుకుంటామని తెలిపారు. కథలాపూర్ మండల అయ్యప్ప భక్తులు వారికి స్వాగతం పలికి తేనీరు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, ఆమెటి గంగాధర్, శివ, కిషన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *