ప్రొఫెసర్ సాయిబాబా మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు

తొర్రూర్ (డివిజన్ )నేటి ధాత్రి

ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేస్తూ కేంద్ర ప్రభుత్వం చే 9 సంవత్సరాలు జైలులో అక్రమo గా నిర్బంధించిన ప్రొఫెసర్ సాయిబాబా అకాల మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని వక్తలు అభిప్రాయపడ్డారు. తొర్రూర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద సాయిబాబా చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి కొత్తపల్లి రవి అధ్యక్షుడు వయించగా ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు ఉపేందర్ రెడ్డి,బుధారపు శ్రీనివాస్, అనిశెట్టి మురళీకృష్ణ లు మాట్లాడుతూ అట్టడుగు దళిత వర్గంలో జన్మించి తొంబై శాతం అంగవైకల్యం ఉన్న అనేక అవరోధాలను అధిగమించి కేంద్ర ప్రభుత్వ నిర్బంధాన్ని సైతం గుండె నిబ్బరంతో ఎదుర్కొన్నాడని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రజలపై సాగుతున్న దోపిడీ నిర్బంధం అక్రమ కేసుల తప్పు అని నిలదించి పీడిత ప్రజల పక్షాన దృఢంగా నిలబడ్డ సాయిబాబా మరణం తీవ్ర ఆవేదనను కలిగించిందని అన్నారు. గూడెల్లి ఎల్లయ్య కొండం జనార్ధన్, సబియా భాను, వెంకటాచారి బాటుక బుచ్చిరాములు లు మాట్లాడుతూ ఫాసిస్టు రాజ్య ఏర్పాటులో భాగంగా 9 సంవత్సరాలు జైలులో అకారణంగా నిర్బంధించి వైద్య అందక ఆరోగ్యం క్షీణించి చనిపోయాడని వారు ఆరోపించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రావిశెట్టి వెంకన్న కొలుపుల శ్రీను జి రమేష్ ఎల్లారెడ్డి పెళ్లి రవీందర్ బాలాజీ చంటి లక్ష్మణ్ బాలు నరేందర్ మహేష్ తదితరులు ఈ నివాళి కార్యక్రమంలో పాల్గొన్నారు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!