భద్రాచలం నేటి ధాత్రి
ఈరోజు భద్రాచలం అశోక్ నగర్ కాలనీలో నందు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా అశోక్ నగర్ కాలనీ యూత్ వారు ఏర్పాటు చేసిన అమ్మవారికి ప్రత్యేక పూజ మరియు అన్నప్రసాద కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
మాట్లాడుతూ ఇంత గొప్ప అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు కమిటీ వారికి శుభాకాంక్షలు తెలిపారు. కమిటీ వారికి, ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు అందరి పై ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు గాడి విజయ్, రాజేష్ కమిటీ సభ్యులు పితాని భాను, కల్లూరి భాను, రాజమండ్రి దుర్గ, దావీద్, సతీష్, రాంపండు, మణికంఠ, పవన్, పీటర్ కమిటీ సభ్యులు, స్వాములు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు