డాక్టర్ పట్టా అందుకున్న సుస్మిత ను అభినందించిన ఎమ్మెల్యే సత్యం

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామానికి చెందిన అమీర్ శెట్టి సుస్మిత బిఏఎంఎస్ బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడికల్ సైన్సెస్ డాక్టర్ పట్టా అందుకున్న సందర్భంగా సోమవారం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అభినందించారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుండి పట్టా అందుకున్నది. ఎనిమిదవ తరగతి వరకు మాత పాఠశాలలో, పదవ తరగతి వరకు ఎన్టీఆర్ మోడల్ పాఠశాల, ఇంటర్మీడియట్ నారాయణ కాలేజీలో విద్యను అభ్యసించింది. డాక్టర్ పట్టా అందుకున్న సుస్మితను స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!