జిఎం సాలెం రాజ్ ఆదేశాల మేరకు
తేదీ. 09.10.2024న జరుగు సెలబ్రేషన్ కొరకు ప్రగతివనం రుద్రంపూర్ నందు జరుగు పనులను సమీక్షించిన కొత్తగూడెం ఏరియా ఎస్ఓటు జిఎం జీవి కోటిరెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామపంచాయతీ తేదీ.09.10.2024న కొత్తగూడెం ఏరియాలోని ప్రగతి వనం నందు ఫ్యామిలీ డే మరియు బతుకమ్మ సెలబ్రేషన్స్ నిర్వహించడం జరుగుతున్నందున ఈరోజు తేదీ:07.10.2024న కొత్తగూడెం ఏరియా ఎస్ఓటు జిఎం జివి కోటిరెడ్డి మరియు ఏజిఎం (సివిల్) సిహెచ్. రామకృష్ణ, ఏరియా వర్క్ షాప్ ఇంజనీర్ అనిల్, డిజిఎం (పర్సనల్ ) బి. శివ కేశవరావు తో ప్రగతి వనంలో జరుగు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 9వ తారీఖున జరుగు ఫ్యామిలీ డే మరియు బతుకమ్మ సెలబ్రేషన్ ల కొరకు జరుగు పనులను త్వరితగతిన పనులను పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగింది మరియు రుద్రంపూర్, గౌతమ్ పూర్ మరియు రామవరం పరిసర ప్రాంతలలో ఉంటున్న ప్రజలు 9వ తారీఖున ప్రగతి వనంలో జరుగు బతుకమ్మ సెలబ్రేషన్లలో వారు బతుకమ్మలను పేర్చుకొని వచ్చి బతుకమ్మ ఆటలో పాల్గొనవలసిందిగా తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డివై.ఎస్.ఈ (సివిల్) అచ్యుతరామయ్య సీనియర్ పిఓ మజ్జి. మురళి, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ వి.శ్రీనివాసరావు, రెస్క్యూ ఇంచార్జ్ అనంతరామయ్య, ఐఎన్టీయూసీ జిఎం ఆఫీస్ ఫిట్ సెక్రటరీ సిహెచ్ సాగర్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.