కరీంనగర్ కబడ్డీ అసోసియేషన్ ను రాష్ట్రంలోనే నంబర్ వన్ గా నిలిచేలా కృషి చేస్తా – వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ను తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్ వన్ గా నిలిచేలా శాయశక్తుల కృషి చేస్తానని కరీంనగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.
ఇటీవల కరీంనగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ గా ఎన్నికైన వెలిచాల రాజేందర్ రావును కరీంనగర్లోని వారి నివాసంలో శుక్రవారం జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా వారు రాజేందర్ రావును సన్మానించి అభినందనలు తెలిపారు. అలాగే కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులను రాజేందర్ రావు సత్కరించారు. ఈసందర్భంగా వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా కబడ్డీ టోర్నమెంట్లు జరిగేలా ప్రత్యేక శ్రద్ధ పెడుతానని పేర్కొన్నారు. అదేవిధంగా కబడ్డీ అసోసియేషన్ కు అత్యుత్తమంగా గౌరవం పెంపొందించేలా పనిచేస్తానని, అందుకు తగ్గ ప్రతిఫలం వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే కరీంనగర్ కబడ్డీ అసోసియేషన్ ను ఉత్తమంగా తీర్చిదిద్ది మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చేలా సహకరిస్తానని చెప్పారు. ఎల్లప్పుడూ ప్రతినిధులకు అందుబాటులో ఉంటానని, కరీంనగర్లో అత్యధికంగా మ్యాచ్ లు నిర్వహించేలా ఒక ప్రణాళికతో ముందుకు సాగుతానని వెలిచాల రాజేందర్ రావు తెలిపారు. రాబోయే రోజుల్లో అందరం కలిసి అసోసియేషన్ అభివృద్ధికి ప్రత్యేక కృషిచేద్దామని పేర్కొన్నారు. ఈసమావేశంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు అమిత్ కుమార్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంపత్ రావు, కాంగ్రెస్ నేత తుమ్మనపల్లి శ్రీనివాసరావు, కాబట్టి అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మల్లేశం గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సుధాకర్, జాయింట్ సెక్రటరీ రామనంద తీర్థ, రెఫరీ బోర్డు చైర్మన్ వీరన్న, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు వంతడుపుల శ్రీనివాస్, కార్యదర్శి యూనుస్ పాషా, ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!