ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన

జిల్లా పంచాయతీ అధికారి డి. వెంకటేశ్వర్లు

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో నిర్వహిస్తున్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియను జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వరరావు పరిశీలన చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని సమర్పించి ఎల్ఆర్ఎస్ యాప్ లో నమోదు చేసుకోవాలని దరఖాస్తుదారులకు సూచించారు. జైపూర్ గ్రామపంచాయతీలో 1791 దరఖాస్తులు రావడంతో త్వరగా సర్వే పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శికి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి డి. వెంకటేశ్వరరావు, డివిజనల్ పంచాయతీ అధికారి ధర్మారాణి,మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాబురావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ తిరుపతి, పంచాయతీ కార్యదర్శి ఉదయ్ కుమార్,దరఖాస్తుదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!