హనుమకొండ, నేటిధాత్రి :
హనుమకొండ, జిల్లా కన్వీనర్ గా వేలం పెళ్లి గ్రామానికి చెందిన మచ్చ పవన్ నూ ఎన్నుకున్నట్టు
బహుజన స్టూడెంట్స్ యూనియన్ బి ఎస్ యు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్ ప్రకటించడం జరిగింది.
కమిటీని ఉద్దేశించి సురేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చి అమలు చేయకపోవడంలో విఫలమైందన్నారు
విద్యాశాఖకు మంత్రిని కేటాయించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కాలయాపన చేయడం సరికాదన్నారు రాష్ట్రంలో స్కూళ్లల్లో కాలేజీలలో ఫీజులు నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసే విధంగా చొరవ తీసుకోవాలని కోరారు విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఐదు లక్షల విద్య అర్హత కార్డు అమలు చేయాలన్నారు.
ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు
కమిటీని ఉద్దేశించి అనేక సమస్యలపై మంద సురేష్ మాట్లాడడం జరిగింది.