బాలాజి పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

నర్సంపేట,నేటిధాత్రి :

నర్సంపేట పట్టణంలోని అక్షర ద స్కూల్ అలాగే బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి.విద్యార్థులు నూతన వస్త్రాలు ధరించి తిరొక్క పులతో బతుకమ్మను అలకరించి కోలాటాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలాజీ
విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, సెక్రటరీ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణా ఆడబిడ్డలు అత్యంత ఆసక్తిగా ఎదురు చూసే వేడుక బతుకమ్మ అని అన్నారు.
ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల జీవన విధానానికి ప్రతీక
బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటుభక్తి శ్రద్ధలతో చేసుకుంటారన్నారు.ఈ నేపథ్యంలో రంగుల రంగుల పూలతో తెలంగాణా
పల్లెలు కళ కళలాడుతాయని తెలిపారు. ఆడపడచులు, యువకులు, పిల్లలు, పెద్దలు తమ
ఆనందాన్ని చూపే కన్నుల పండుగగా తెలంగాణ ప్రజలకు ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ ఈ బతుకమ్మ పండుగ అని చెప్పారు.ఈ కార్యక్రమంలో పాఠశాల
ప్రిన్సిపాల్ ఆర్. జ్యోతి గౌడ్,అక్షర స్కూల్ ప్రిన్సిపాల్ భవాని, సెక్రటరీ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి,ఉపాధ్యాయ బృదం, విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!