జమ్మికుంట: నేటి ధాత్రి
పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే రోగాలను అరికట్టవచ్చని కోరపల్లి గ్రామ కార్యదర్శి తారక రామారావు తెలిపారు. జమ్మికుంట మండలం వెంకటేశ్వర పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గోవిందపురం గ్రామంలో స్వచ్ఛతహి సేవ కార్యక్రమంలో భాగంగా శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులతోపాటు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొని గ్రామంలోని పురవీధుల్లో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసరాల శుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలని, ప్రతి మంగళవారం శుక్రవారం డ్రైడే పాటించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కోండు బిక్షపతి, గైకోడి నాగరాజు, దొగ్గల భాస్కర్ ,కారోబార్ సారయ్య, కొండు తిరుపతి ,లక్ష్మయ్య, సారథి తదితరులు పాల్గొన్నారు.
గోవిందా పూర్ లో స్వచ్ఛతాహి సేవ
