జాతీయ సేవ పథకం ఫై అవగాహనా సదస్సు

నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో జాతీయ సేవ పథకంపై అవగాహనా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ మాట్లాడుతూ కళాశాలలో రెండు ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ఉన్నాయని విద్యార్థులు ఈ జాతీయ సేవ పథకంలో నమోదు చేసుకోవాలని తెలిపారు.ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం ద్వారా వాలంటీర్లు క్రమశిక్షణ,న్యాయకత్వ లక్షణాలు పెంచుకొని సామజికసేవలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కళాశాల యన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు,డాక్టర్ ఎం.రాంబాబు,డాక్టర్.డి.సంధ్యలు జాతీయ సేవ పధకం యొక్క చారిత్రక నేపథ్యం అలాగే దాని యొక్క ప్రాధాన్యతను వివరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ భైరి సత్యనారాయణ,అకడమిక్ కో-ఆర్డినేటర్ డాక్టర్.కందాల సత్యనారాయణ,స్టాఫ్ సెకట్రరీ డాక్టర్.ఎం సోమయ్య మరియు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎస్.కమలాకర్,అధ్యాపకులు ఎం.ఎం.కే.రహిముదిన్,డాక్టర్.భద్రు భూక్య,డాక్టర్.జె.రాజీరు,ఎస్.రజిత,ఆర్.రుద్రాణి,డాక్టర్.బి.గాయత్రి,బి.వీరన్న,బి.గ్లోరి,ఆర్.మాధవి,నిజాము,డాక్టర్. భార్గవి,రాకేష్,లక్ష్మి,జి.అనిత, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!